ట్రీట్మెంట్ అనంతరం ఇండియాలో ల్యాండ్ అయ్యిన ప్రభాస్…

ట్రీట్మెంట్ అనంతరం ఇండియాలో ల్యాండ్ అయ్యిన ప్రభాస్...
Cinema News, Entertainment

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “సలార్” కోసం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇండియన్ మూవీ దగ్గర ఒక మోస్ట్ అవైటింగ్ రిలీజ్ గా రాబోతుండగా ఈ సినిమా షూట్ అంతా కంప్లీట్ అయ్యాక ప్రభాస్ ఎప్పటి నుంచో బాధపడుతున్న తన మోకాలి సమస్యకి ఇటలీలో సర్జరీ చేయించుకున్నాడు.

అయితే రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమా ల సమయంలో కాళీ నొప్పితో స్ట్రగుల్ అయ్యిన ప్రభాస్ సలార్ ని కంప్లీట్ చేసి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు. అయితే ఈ ట్రీట్మెంట్ అనంతరం తాను ఇటలీ లోనే రెండు నెలల పాటుగా రెస్ట్ తీసుకోవాల్సి ఉన్నది . దీనితో అప్పుడే ప్రభాస్ నవంబర్ కి అలా ఇండియాలో ల్యాండ్ అవుతాడు అని తెలిసింది. మరి ఇప్పుడు అనుకున్నట్టే ఇండియాలో ఫైనల్ గా హెల్తీగా అయితే తాను అడుగు పెట్టాడు. దీనితో ప్రభాస్ లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.