జోర్డాన్‌లో ఇరుక్కుపోయిన మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్

జోర్డాన్‌లో ఇరుక్కుపోయిన మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్

మన భారతీయులు సైతం విదేశాల్లోనే చిక్కిపోయారు. కరోనాను కట్టడి చేసేందుకు అన్ని దేశాలు లాక్ డౌన్‌ను విధిగా పాటిస్తున్నాయి. మన దేశంలోనూ విదేశీయులున్నట్టు.. మనవారు విదేశాల్లో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో మలయాళం స్టార్ హీరో, మూవీ యూనిట్ అక్కడే ఇరుక్కుపోయింది.

ఆడుజీవితం అనే మూవీ షూటింగ్‌లో భాగంగా పృథ్వీరాజ్, ఆయన బృందం జోర్డాన్‌కు వెళ్లారు. అయితే కరోనా వ్యాప్తి చెందడంతో షూటింగ్‌ను అనుమతి ఇవ్వలేదంట. అయితే తరువాత మళ్లీ రిక్వెస్ట్ చేయడంతో కొన్ని రోజులు పొడిగించారని తెలిపాడు. అయితే కరోనా మరింత తీవ్రతరం కావడంతో షూటింగ్ పూర్తిగా ఆపివేశామని చెప్పుకొచ్చాడు.

అయితే ఇక్కడే ఓ హోటల్ రూమ్‌లో ఉన్నామని, తమతో పాటు ఓ వైద్యుడు కూడా ఉంటున్నాడని చెప్పుకొచ్చాడు. జోర్డాన్ వైద్యులు కూడా తమను నిరంతరం పరీక్షిస్తున్నారని తెలిపాడు. తామంతా క్షేమంగానే ఉన్నట్లు పేర్కొన్నాడు. తమకు భారతదేశానికి తిరిగి రావాలని ఉందని, అయితే పరిస్థితులు చక్కబడ్డాక వెంటనే వస్తామని వెల్లడించాడు.