హాట్ కేకుల్లా ప్రియా వారియ‌ర్ పోస్టులు ఒక్కో పోస్టుకు రూ.8ల‌క్ష‌లు

Priya Prakash Varrier Earning 8 Laks Per One Post In Instagram

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఓవ‌ర్ నైట్లో స్టార్ గా మారిపోయిన మ‌ల‌యాళ కుట్టి ప్రియా వారియ‌ర్ పాపులారిటీ అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఫాలోయ‌ర్ల విష‌యంలో స్టార్ హీరోయిన్ల‌ను సైతం ఆమె క్రాస్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో ప్రియ‌ను ఫాలో అవుతున్న‌వారి సంఖ్య 45ల‌క్ష‌ల‌కు పైమాటే. త‌మ‌న్నా, తాప్సీ లాంటి స్టార్ హీరోయిన్లే కాదు…బాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు కూడా ఇంత‌మంది ఫాలోయ‌ర్లు లేరు. ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఆదాయ‌వ‌న‌రుగా మార్చుకుంటోంది ప్రియా. దీప‌ముండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకున్న సామెత‌గా త‌న పాపులారిటీని క్యాష్ చేసుకుంటోంది.

ఇన్ స్టాగ్రామ్ లో తాను అప్ లోడ్ చేసే ఒక్కో పోస్టు ద్వారా 8ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు సంపాదిస్తోంది. ల‌క్ష‌లాదిమంది ఫాలోయ‌ర్ల కార‌ణంగా ఆమెకు ఈ ఆదాయం ల‌భిస్తోంది. అంతేకాదు…బాలీవుడ్ తో పాటు ప‌లు ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌ల నుంచి ఆమెకు ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఆమె త‌న స్టార్ డ‌మ్ ను ఎంజాయ్ చేస్తోంది. అదే స‌మ‌యంలో త‌న‌కు ఇంత పాపులారిటీ తెచ్చిపెట్టిన ఒరు అదార్ ల‌వ్ సినిమా ప్ర‌మోష‌న్ లోనూ చురుగ్గా పాల్గొంటోంది. ఈ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ను, బాలీవుడ్ హీరో అభిషేక్ బ‌చ్చ‌న్ ను ప్రియావారియ‌ర్ క‌లిసింది.

కొచిలోని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జ‌రుగుతున్న ఐఎస్ఎల్-2018కి ప్రియ త‌న స‌హ‌నటుడు రోష‌న్ అబ్దుల్ ర‌హూఫ్ తో క‌లిసి హాజ‌రైంది. అక్క‌డే ఉన్న స‌చిన్, అభిషేక్ బ‌చ్చ‌న్ ను క‌లిసింది. ప్రియ ట్విట్ట‌ర్ లో ఈ విష‌యాన్ని తెలియ‌జేసింది. వారంతా క‌లుసుకున్న వీడియోతోపాటు, స‌చిన్ తో ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఇక్క‌డ‌కు రావ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని, ఇవాళ ఇద్ద‌రు గొప్ప వ్య‌క్తుల‌ను క‌లుసుకున్నాను అని కామెంట్ చేసింది.