నితిన్‌, వెంకీని ఒక్కటి చేయబోతున్న రాధాకృష్ణ

Producer Radha Krishna Producing Film With Venky Kudumula And Nithin
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో వరుసగా చిత్రాలు నిర్మించి ఒక్కసారిగా టాలీవుడ్‌ స్టార్‌ నిర్మాతగా మారిన రాధాకృష్ణ తాజాగా ‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని నిర్మించిన విషయం తెల్సిందే. ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటంతో డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు. ఆ నష్టాన్ని తాను సైతం భరిస్తాను అంటూ డిస్ట్రిబ్యూటర్ల లాస్‌లో 50%ను తిరిగి ఇవ్వడం జరిగింది. దీంతో నిర్మాత రాధాకృష్ణ గురించి అంతా కూడా పాజిటివ్‌గా మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలోనే రాధాకృష్ణ వరుసగా ఇతర హీరోలతో, దర్శకులతో సినిమాలు నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు. 

ప్రస్తుతం ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ చిత్రాన్ని నిర్మించే పనిలో ఉన్న ఈయన తాజాగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. ‘ఛలో’ చిత్రం సక్సెస్‌ అవ్వడంతో వెంటనే ఆ దర్శకుడికి అడ్వాన్స్‌ ఇవ్వడం జరిగింది. నితిన్‌తో ‘అఆ’ చిత్రాన్ని నిర్మించే సమయంలోనే రాధాకృష్ణ మరో సినిమాకు అడ్వాన్స్‌ ఇవ్వడం జరిగింది. నితిన్‌ డేట్లు ఎలాగూ ఉన్నాయి కనుక, వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ హీరోగా ఒక సినిమాను తీయాలని దర్శకుడు రాధాకృష్ణ నిర్ణయించుకున్నాడు. వీరిద్దరిని కలిపేశాడు. 

‘ఛలో’ విడుదలై ఒక వైపు విజయవంతంగా దూసుకు పోతున్న సమయంలోనే నితిన్‌ కోసం ఒక మంచి స్టోరీ లైన్‌ను సిద్దం చేశాడు వెంకీ. ఆ స్టోరీలైన్‌కు నితిన్‌ ఓకే చెప్పడం, త్వరలోనే షూటింగ్‌ కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేయడం చకచక జరిగిపోతున్నాయి. ప్రస్తుతం నితిన్‌ ‘ఛల్‌ మోహన్‌ రంగ’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది.