శాలిని పాండే పై ఫైర్‌ అవుతున్న నిర్మాతలు

శాలిని పాండే పై ఫైర్‌ అవుతున్న నిర్మాతలు

అర్జున్‌ రెడ్డితో మొదటి చిత్రంతోనే భారీ హిట్టు కొట్టిన షాలిని పాండేకి ఆ తర్వాత చెప్పుకోతగ్గ అవకాశాలు రాలేదు. రెండు, మూడు సినిమాలలో చిన్న పాత్రలు చేసిన షాలిని 118లో మాత్రం హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం రాజ్‌ తరుణ్‌తో ఇద్దరి లోకం ఒకటే అనే చిత్రంతో పాటు అనుష్కతో నిశ్శబ్ధంలో నటిస్తోంది. తమిళంలో ఒక రెండు, మూడు చిత్రాల్లో నటిస్తోన్న టైమ్‌లో ఆమెకి బాలీవుడ్‌లో ఒక పెద్ద సినిమాలో నటించే అవకాశం వచ్చింది. దాంతో మకాం ముంబయికి మార్చేసిందట.

ఇక్కడి చిత్రాలకి డేట్స్‌ ఇచ్చి, షూటింగ్‌ పూర్తి చేయకుండా ముంబయి వెళ్లిపోవడమేంటని నిర్మాతలు ఫైర్‌ అవుతున్నారు. అయితే ఆమె మేనేజర్‌కి కూడా షాలిని అందుబాటులో లేదట. గతంలో తన డేట్లు చూసిన మేనేజర్‌ని కాదని ముంబయిలో కొత్త పీఆర్‌ ఏజెన్సీని చూసుకుందట. దీంతో షాలినికి వచ్చిన ఆ హిందీ అవకాశాన్ని చెడగొట్టి అయినా ఇక్కడి సినిమాలు పూర్తి చేయించాలని నిర్మాతలు సీరియస్‌ అవుతున్నారు.

ఆమె నిర్మాతలని ఇబ్బంది పెడుతోందనే న్యూస్‌ మీడియాకి లీక్‌ చేసి నెగెటివ్‌గా చూపిస్తున్నారు. త్వరలోనే ఆమెపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసి అవసరమయితే నష్ట పరిహారం వసూలు చేయాలని కూడా చూస్తున్నారు. బాలీవుడ్‌లో అవకాశం రావడమనేది ఎక్సయిటింగ్‌ విషయమే కానీ ముందుగా చేసుకున్న కమిట్‌మెంట్లకి న్యాయం చేయడం కూడా తన బాధ్యతే కదా మరి.