ఒక చావు…మూడు ఆత్మహత్యలు….ప్రేమే కారణం ?

punjabi family suicide

హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో విషాదం చోటుచేసుకుంది. డీడీ కాలనీలో నివాసం ఉంటున్న ఓ పంజాబీ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది.  పంజాబీ కుటుంబానికి చెందిన నీలమ్ అనే ఆవిడ అనారోగ్యంతో మరణించింది. దీంతో ఈ విషయన్ని ఎవరికీ తెలపని ఆ కుటుంబ పెద్ద పవన్ కర్బంద తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితతే ఈ విషయం తెలిసిన వారి కుమార్తె మన్నూ (34), కుమారుడు నిఖిల్ (30) కూడా కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకున్నారు. వీరు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. నిన్న  ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో అచేతనంగా పడిఉన్న కుటుంబ సభ్యులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరణించిన దంపతులను పవన్ కర్బంద (65), నీలమ్ (55)గా గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తె కూతుర్ని దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకరంటే ఒకరికి ఉన్న వల్లమాలిన ప్రేమే ఆత్మహత్యలకు కారణమని తెలుస్తోంది. రెండు రోజులుగా ఇంట్లో నుంచి అలికిడి లేదని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..