నేనేం మాట్లాడలేదు : పూరి

puri jaganadh statement on drugs rocket case on twitter

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దర్శకుడు పూరి జగన్నాధ్‌ డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లుగా పోలీసులు అనుమానిస్తూ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈనెల 19న ఆయన్ను విచారించబోతున్నారు. పూరితో పాటు ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా డ్రగ్స్‌ కేసులో పోలీసుల విచారణ ఎదుర్కోబోతున్నాడు. నోటీసులు అందుకున్న దాదాపు అంతా కూడా మీడియా ముందుకు వచ్చి లేదా సోషల్‌ మీడియాలో ఈ విషయమై స్పందించడం జరిగింది. అందరిలాగే పూరి కూడా ఈ విషయమై స్పందించాడు, తనకు డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధం లేదు అని, తాను డ్రగ్స్‌ తీసుకోను అంటూ ప్రకటించినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.

డ్రగ్స్‌ వ్యవహారంలో తాను స్పందించినట్లుగా వస్తున్న వార్తలను పూరి కొట్టి పారేశాడు. తాను ఇంత వరకు ఆ విషయమై స్పందించలేదని, తాను స్పందించకుండానే కొందరు ప్రచారం చేస్తున్నారంటూ పూరి ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను పైసా వసూల్‌ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నట్లుగా దర్శకుడు పూరి ట్వీట్‌ చేయడం జరిగింది. ఈ ట్వీట్‌తో పూరి డ్రగ్స్‌ తీసుకున్నట్లుగా భావించవచ్చని కొందరు భావిస్తున్నారు. ఇలా ట్వీట్‌ చేయడం ఏదో తాను డ్రగ్స్‌ తీసుకోవడం లేదు, తీసుకోలేదు అంటూ ప్రకటిస్తే అయిపోయేది, కాని అతడు డ్రగ్స్‌ తీసుకుంటాడు కనుక అలాంటి ప్రకటన చేయలేదు అంటూ సోషల్‌ మీడియాలో కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

 మరిన్ని వార్తలు:

నా కొడుకులకు డ్రగ్స్‌ అలవాటు లేదు