క్వారంటైన్ కేంద్రాలు లైంగిక కేంద్రాలుగా మారి.. ఇలా…

ప్రపంచాన్ని వణికించేస్తున్న వైరస్ కరోనా. ఈ కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. అయితే కొన్ని చోట్ల కరోనా రోగుల చేష్టలు, ఆగడాలు శృతిమించిపోతున్నాయి. తాజాగా ఉగాండా దేశంలో దారుణమైన వెకిలి చేష్టలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా క్వారంటైన్ కేంద్రాల్లోనే సెక్స్ చేసుకుంటూ దర్శనమిస్తున్న ఉగాండా దేశంలోని కరోనా రోగుల తీరు అధికారులను ముచ్చెమటలు పట్టిస్తోంది. క్వారంటైన్ కేంద్రాల్లోనే వారు ఇతరులతో లైంగిక కోరికలు తీర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా మహమ్మారితో ప్రపంచమంతా వణికిపోతుంటే వీరి చేష్టలకు అక్కడి సిబ్బంది షాక్ కు గురౌతున్నారు. అయితే ఇప్పటికే 20 లక్షల మందికి పైగా కరోనా సోకగా.. లక్షకు పైగా ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యం నుంచి నిరుపేద దేశం వరకు కరోనాతో కునారిల్లుతుంది. ఈ వైరస్ ను అరికట్టేందుకు దేశాలకు దేశాలే లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. అయితే కొన్ని దేశాల్లో కరోనా రోగుల తీరుతో వైద్య సిబ్బంది, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చెప్పిన మాట వినకుండా వార్డుల్లో ఇష్టారీతిగా ప్రవర్తించడం, డాక్టర్ల సూచనను పట్టించుకోకపోవడంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి.

తాజాగా ఆఫ్రికా ఖండంలోని ఉగాండా దేశంలో అయితే కరోనా రోగులు మరింత రెచ్చిపోతున్నారు. క్వారంటైన్ కేంద్రాలనే బెడ్రూమ్‌లుగా మార్చేసుకుంటున్నారు. స్వయంగా ఈ విషయాన్ని ఆ దేశ అధికారులు వెల్లడించడం సంచలనం రేపుతుంది. క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులు ఒంటరితనాన్ని భరించలేక ఒకరితో ఒకరు లైంగిక సంబంధాలు ఏర్పరచుకుంటున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఒంటరితనాన్ని భరించలేని వారంతా వార్డుల్లోనే గుంపులు గుంపులుగా తిరుగుతూ.. వైద్య సిబ్బందిని హడలెత్తిస్తున్నారు. దీంతో కొందరు ఎదుటివారికి ఆకర్షితులై రాత్రివేళ శారీరకంగా కలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే కరోనాను కట్టడి చేయలేమని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ… వారు ఏమాత్రం పట్టించుకోకపోవడం విశేషం.

అంతేకాకుండా ఉగాండా ఆరోగ్య శాఖ సెక్రటరీ డయానా అట్విన్ తాజాగా మాట్లాడుతూ… ‘కరోనా వైరస్‌ను అరికట్టేందుకు మేం తీసుకుంటున్న చర్యలకు ఇలాంటి చర్యలు ఇబ్బందిపెడుతున్నాయి. కరోనా పాజిటివ్ ఉన్న వారు ఆ పక్క గదులకు వెళ్లి వారితో లైంగికంగా కలుస్తున్నారు. ఇలాంటి చర్యలతో కరోనా మరింత వ్యాపించే అవకాశముంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉగాండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ప్రజల్లో మాత్రం మార్పు రాకపోవడం సర్వత్రా విస్మయాన్ని కలిగిస్తుంది.