నేను సేఫ్‌గానే ఉన్నాను…..‘రాహు’ హీరోయిన్

నేను సేఫ్‌గానే ఉన్నాను.....‘రాహు’ హీరోయిన్

‘రాహు’’ సినిమా హీరోయిన్ కృతి గార్గ్‌ కనిపించడంలేదని సినిమా దర్శకుడు సుబ్బు వేదుల పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఫోన్ చేసి ప్రభాస్ సినిమాలో ఆఫర్ ఉందని చెప్పి కృతి గార్గ్‌‌తో మాట్లాడేందుకు ఓ కుర్రాడు యత్నించాడు. సుబ్బుతో కూడా మాట్లాడాడు. అప్పటికే కృతి గార్గ్‌ ముంబై వెళ్లిపోయారు. అయితే ముంబై వెళ్లిన ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె ఏదన్నా ప్రమాదంలో చిక్కుకుందేమోనని భయపడి సుబ్బు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. అయితే ఇప్పుడు కృతి గార్గ్‌ సురక్షితంగానే ఉన్నారట. ఈ విషయాన్ని ఆమె వీడియో కాల్ ద్వారా వెల్లడించారు.

‘హాయ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు ఉదయం ముంబైలోని నా ఇంటికి వచ్చాను. రాగానే నిద్రపోయాను. దాంతో దర్శకుడు సుబ్బు ఫోన్లు చేస్తున్నా కూడా నేను లిఫ్ట్ చేయలేకపోయాను. దాంతో ఆయన కంగారుపడి పోలీసులకు ఫిర్యాదు చేసారు. నేను సేఫ్‌గానే ఉన్నాను. నాకు సందీప్ రెడ్డి వంగా పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేసి సినిమాలో ఆఫర్ ఉందని చెప్పిన మాట నిజమే. కానీ నేను ఆ మాటలు నమ్మలేదు. నేను సేఫ్‌గానే ఉన్నాను. నేను సురక్షితంగా ఉండాలన్ని కోరుకున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు. అయితే సుబ్బు ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఆ అజ్ఞాత వ్యక్తి ఫోన్ నెంబర్‌ను ట్రేస్ చేసారని, అది అనంతపురానికి చెందిన నరేష్ అనే వ్యక్తి నెంబర్‌గా చూపిస్తుందని తెలిపారు. ఈ కేసును సైబర్ క్రైం పోలీసులకు అప్పగించారు. వాళ్లు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.