నిప్పుతో మరియు నీరుతో పోల్చిన రాజమౌళి

నిప్పుతో మరియు నీరుతో పోల్చిన రాజమౌళి

కరోనా కల్లోలం..యావత్ దేశం మొత్తం కూడా చిగురుటాకులా వణికిపోతోంది. అంతా దాని గురించే చర్చ.. మరో టాపిక్ లేదు. ఇంకా లాకౌట్ ప్రకటించటం వలన ప్రజలందరూ ఎటువంటి పనులు లేక ఇంటికే పూర్తిగా పరిమితం కావాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో సినిమా న్యూస్ కోసం చూసేవారికి ఈ కొత్త తెలుగు సంవత్సరాది రోజున సినీ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ లభించింది. కరోనా నుంచి అందరి దృష్టి మోస్టే అవేటెడ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ వైపు మళ్లించారు రాజమౌళి . సినిమా పేరు మారుస్తారని.. కొత్తది పెడుతారని అందరూ భావించారు. కానీ ఆర్ఆర్ఆర్ మూడు అక్షరాలనే ‘రౌద్రం రణం రుధిరం’ అంటూ ప్రకటించేసి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు.

ఆర్ఆర్ఆర్ లోగో కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మిలియన్ల వ్యూస్ వచ్చాయి . రాజమౌళి మాయాజాలానికి అందరూ షాక్ అయ్యారు. కరోనా ట్రేండింగ్ లో ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈ లోగో లో అందరూ గమనించని విషయం ఏంటంటే రాంచరణ్ ను నిప్పుతో ఎన్టీఆర్ ను నీరుతో కదిలే ఇద్దరు అగ్నిపర్వతాల వలే రాజమౌళి చూపించారు.

అల్లూరి సీతారామారాజు పాత్ర పోషించిన రాంచరణ్ ను రాజమౌళి నిప్పుతో చూపించారు. నిప్పు అర్థం ఏంటంటే విప్లవ వీరుడు అల్లూరిని ఆ పోరుబాటకు ప్రతీకగా అగ్నికణంగా రాజమౌళి తీర్చిదిద్దాడు. విప్లవానికి ప్రతీక నిప్పు ఎరుపు.. అందుకే చరణ్ ను ఆ కోణంలో ప్రజెంట్ చేశారు.

ఇక నీరును ఎన్టీఆర్ కు ఎందుకు పెట్టారన్నది అందరికీ తెలియాలంటే తెలంగాణలోని కొమురంభీం పోరాడిన కొమురం భీం జిల్లా జోడెఘాట్ కు వెళ్లాల్సిందే.. నిజాం పాలకులతో పోరాడిన కొమురం భీం నినాదం ‘జల్ జంగల్ జమీన్’. అంటే నీరు అడవీ తమ ప్రాంతం.. వీటి కోసం కొమురం భీం తుపాకీ చేతపట్టి నిజాం రజాకర్లను ఎదురించారు. ఇందులో మొదటిది జల్ అంటే జలం కోసం. అందుకే కొమురం భీం పోరాట స్ఫూర్తిని తెలిసేలా ఎన్టీఆర్ ను జలంతో రగిలేలా జక్కన్న తీర్చిదిద్దాడు. అదన్నమాట సంగతి.