‘పద్మావతి’పై పిచ్చి ఆరోపణలు

rajput karni sena alleges padmavati funded dawood

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]          

బాలీవుడ్‌లో సంజయ్‌ లీలా భన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పద్మావతి’ చిత్రం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడిని, నటించిన హీరోలను, పద్మావతిగా నటించిన దీపిక పడుకునేను చంపేస్తాం అంటూ ఎంతో మంది బెదిరిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్‌ బోర్డు వారు కూడా కొన్ని కారణాల వల్ల వెనక్కు పంపిన విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని మొదట డిసెంబర్‌ 1న విడుదల చేయాలని భావించారు. అయితే తాజాగా సెన్సార్‌ కార్యక్రమాల్లో టెక్నికల్‌ సమస్య తలెత్తడం వల్ల సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక ఈ చిత్రంపై మొదటి నుండి ఆరోపణలు చేస్తున్న రాజ్‌పూత్‌ కర్ణి మరియు ఇతర సంఘాల వారు కొత్త ఆరోపణను మొదలు పెట్టారు.

padmavathi-moovie

ఈ చిత్రం నిర్మాణంలో అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం పెట్టుబడులు పెట్టాడని, ఆయన వల్లే సినిమా ఇంత బడ్జెట్‌తో తెరకెక్కిందని, దేశ ద్రోహి అయిన దావూద్‌ ఇబ్రహీం డబ్బుతో నిర్మాణం అయిన ఈ సినిమాను విడుదల కానిచ్చేది లేదు అంటూ రాజ్‌పూత్‌ కర్ణి సంఘం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బాలీవుడ్‌ సినిమాలకు అండర్‌ వరల్డ్‌ ఫైనాన్స్‌ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. కాని అవి వాస్తవం అని తేలలేదు. తాజాగా ఇప్పుడు కూడా మరోసారి అలాంటి వాదనను వీరు తీసుకు వస్తున్నాయి. ఈ ప్రచారంలో కూడా నిజం ఉండి ఉండదని, ప్రస్తుతం దావుద్‌ ఇబ్రహీం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, ఆయన బాలీవుడ్‌ సినిమాలపై దృష్టి పెట్టేంత ఆరోగ్యంగా లేడు అంటూ కొందరు అంటున్నారు. ఇవన్ని కూడా పిచ్చి ఆరోపణలు అంటూ సినీ వర్గాల వారు కొట్టి పారేసే ప్రయత్నం చేస్తున్నారు. వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని వచ్చే నెల చివర్లో విడుదల చేసే అవకాశం ఉంది.

padmavathi-movie-up-dates