శృతిమించినా పర్వాలేదంటున్న చరణ్‌

Ram Charan Agree For Budget For Syeraa Narasimha Reddy Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ షెడ్యూల్‌లో అమితాబచ్చన్‌తో పాటు ఇంకా పలువురు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొంటున్నారు. తాజాగా చిరంజీవి, నయనతారల వివాహ కార్యక్రమంకు సంబంధించిన సీన్స్‌ను చిత్రీకరించారు. ఆ సీన్స్‌ స్టిల్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాడు. దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంను మొదటి నుండి కూడా 150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. 

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సైరా చిత్ర బడ్జెట్‌ అనుకున్నదానికంటే 50 శాతం ఎక్కువ అయ్యే అవకాశం ఉందని, నటీనటుల డేట్లు మరియు ఎక్కువ రోజులు సినిమా షూటింగ్‌ చేయడం కారణంగా సినిమా బడ్జెట్‌ అమాంతం పెరగబోతుందని చెబుతున్నారు.  బడ్జెట్‌ ఎంత అయినా పర్వాలేదు, సినిమా అనుకున్నట్లుగా రావాలనే పట్టుదలతో రామ్‌ చరణ్‌ ఉన్నాడు. 200 నుండి 225 కోట్ల వరకు కూడా ఖర్చు చేసే యోచనలో చరణ్‌ ఉన్నాడు. భారీ అంచనాలున్న సినిమా అవ్వడంతో ఖచ్చితంగా పెట్టిన పెట్టుబడి వస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. సినిమా ఎంత మామూలుగా ఉన్నా కూడా అన్ని భాషల్లో కలిపి కనీసం 300 కోట్లు రావడం ఖాయం అనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. అందుకే రామ్‌ చరణ్‌ ఎంత బడ్జెట్‌ అయినా పర్వాలేదు అంటున్నాడు.