షాక్ కి గురయ్యేలా చేసిన రామ్ గోపాల్ వర్మ సమాధానం

షాక్ కి గురయ్యేలా చేసిన రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం బ్యూటిఫుల్ చిత్ర ప్రమోషన్లలో బిజీగా వున్నారు. అయితే విశాఖపట్టణంలో వున్నా రామ్ గోపాల్ వర్మ ని ఒక సమావేశంలో విలేకరి అడిగిన ప్రశ్నకి సెటైరికల్ గా సమాధానం ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని రగడ గురించి ప్రజలు, రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన సమాధానం ప్రతి ఒక్కరిని షాక్ కి గురయ్యేలా చేసిందని చెప్పాలి.

రాజధాని విషయంలో అంతగా నాకు అవగాహన లేదంటూనే, రాజధాని ఎక్కడున్నా ఒకటే అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. రాజధాని పక్క రాష్ట్రంలో వున్నా పెద్దగా తేడా ఉండదని అన్నారు. ఇటీవల కాలంలో అమరావతి ఫై వ్యాఖ్యలు చేసినా అవి మద్యం మత్తులో చేసానని తెలిపారు. ఇపుడు మద్యాహ్నం కాబట్టి ఆ విషయం ఫై ఏం మాట్లాడలేను అని అన్నారు. అయితే పబ్లిసిటీ కోసమే నేను అలా మాట్లాడాను అని అన్నారు. అయితే విలేఖరికి ఉచిత సలహా కూడా ఒకటి ఇచ్చారు. మీరు జీవితాన్ని చాల సీరియస్ గా తీసుకుంటున్నారు అని అన్నారు. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదని అన్నారు.