తాజాగా మరొక వివాదంలో రామ్ గోపాల్ వర్మ

తాజాగా మరొక వివాదంలో రామ్ గోపాల్ వర్మ

నిత్యం వివాదాలతో సహవాసం చేసే ప్రముఖ సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరొక వివాదానికి తెరలేపారు.కాగా రామ్ గోపాల్ వర్మ నిర్మాణ సారథ్యంలో ఇటీవల తెరకెక్కిన చిత్రం బ్యూటిఫుల్… కాగా ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషన్లలో పాల్గొంటున్న వర్మ, ఒక ప్రైవేట్ మీడియా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. అయితే అవి జోకులో, లేక నిజమో తెలియక అభిమానులందరూ కూడా తలపట్టుకుంటున్నారు. కాగా వర్మ మరొకసారి దావుద్ ఇబ్రహీం, సీఎం జగన్ లను తన ప్రమోషన్లలో భాగంగా వాడుకున్నారు. ఈ నేపథ్యంలో వర్మ చేసిన వాఖ్యలు ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారాయి.

ఒక ప్రైవేట్ మీడియా ఛానల్ తో మాట్లాడిన వర్మ… “ఏదో ఒక రకంగా వైఎస్ జగన్ నాకు ఓ రూ. 50 కోట్లు ఇచ్చారు. మరో గుర్తు తెలియని వ్యక్తి 30 కోట్లు ఇచ్చారు. దావూద్ ఇబ్రహీం మరో 15 కోట్లు ఇచ్చాడు” అని వివాదాస్పద వాఖ్యలు చేశారు. అంతేకాకుండా సీఎం జగన్, దావూద్ లు తనకు ప్రధానమైన ఫైనాన్షియర్స్ అని, ప్రస్తుతానికి సినీ రంగంలో ఉన్న ఆయన తరువాత ఏ మూడ్ వస్తే, ఆ పని చేస్తుంటానని వాఖ్యానించారు. ఇకపోతే తన నిర్మాణ సారథ్యంలో ఇటీవల తెరకెక్కిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రం ద్వారా తాను నష్టపోలేదని, అలాంటి సినిమాలు ఇంకా తీస్తానని వెల్లడించారు.