నవ్యాంధ్రకే….స్కీమాంధ్రకి కాదు !

Ram madhav fires on chandrababu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మోడీ పాలన నాలుగేళ్ళు పూర్తయిన సందర్భంగా ఏపీలో బిజెపి విజయోత్సవ సమావేశం గుంటూరులో ఏర్పాటు చేసింది. అందులో రామ్ మాధవ్ సహా కొంతమంది ఏపీ బీజేపీ పెద్దలు పాల్గొన్నారు. ఏపీలో బీజేపీపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతామని అన్నారు. కన్నా నాయకత్వంలో ఏపీలో నూతన ఒరవడిని సృష్టిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని..అంతే కానీ అవినీతికి కాదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 100 శాతం నిధులు ఇచ్చామని రైల్వే జోన్ తోపాటు అన్ని హామీలను అమలు చేసి తీరతామని అన్నారు. పదేళ్ళ కాలానికి షెడ్యూల్ వేసుకుంటే మూడేళ్ళకే టీడీపీ రాజకీయ దురుద్దేశంతో ఎన్డీయే నుంచి బయటికివెళ్లిందని ఆయన ఆరోపించారు.

ప్రధాని మోడీ గతంలోనే బహిరంగంగా చెప్పారని..సీమాంధ్ర స్కామాంధ్రగా మారితే సహించేదిలేదన్నారని తెలిపారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని పెడితే..చంద్రబాబు అదే కాంగ్రెస్ నేతలతో చేతులు కలుపుతున్నారని రామ్ మాధవ్ విమర్శించారు. 2019లో బిజెపి సొంతంగానే ఏపీలోనూ అధికారంలోకి వస్తామని..ఈ దిశగా సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. బీజేపీ తో బాగస్వమ్యంతో టీడీపీ కి అధికారం దక్కిందని ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా రాజకీయ ఎదుగుదలకు మామగారు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. బిజెపిని ఎదుర్కొలేకే కొత్త ఫ్రంట్లు..టెంట్లు వస్తున్నాయని అన్నారు. నిజాయితీ తో కూడిన పాలనను అందిస్తున్న మోడీ సర్కారుకు ఎప్పుడూ ప్రజల ఆశీస్సులు ఉంటాయన్నారు. అత్యంత విశ్వసనీయతతో, పారదర్శకతతో కూడిన స్వచ్ఛమైన పరిపాలన అందిస్తుంటే కొందరు ఇంత నిజాయితితో పని చేస్తే మేము మీతో ఉండం అని మధ్యలోనే స్నేహాన్ని వదిలేస్తున్నారని చంద్రబాబుని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మహానాడు ఫ్లెక్సీలన్నీ వారసత్వంతో నిండిపోయాయని చెప్పిన ఆయన, ఏపీలో టీడీపీ లాంటి వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలుకుతామని అన్నారు. టీడీపీ తప్పుడు విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన చెప్పారు.