Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాదాపు ‘బాహుబలి’ స్థాయి బడ్జెట్తో ఈ చిత్రాన్ని దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్నాడు. 250 కోట్ల బడ్జెట్తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్ వారు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో అతి కీలకమైన యాక్షన్ ఎపిసోడ్కు సంబంధించిన సీన్స్ను దుబాయిలో దాదాపు 90 కోట్ల ఖర్చుతో తెరకెక్కిస్తున్నారు. ఆ స్థాయిలో బడ్జెట్తో యాక్షన్ సీన్స్ అంటే స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. దుబాయిలో దాదాపు మూడు నెలల పాటు చిత్రీకరణకు ప్లాన్ చేశారు. అయితే అర్థాంతరంగా షూటింగ్కు బ్రేక్ వేసి చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నారు.
దుబాయి అంటే అరబ్ కంట్రీ, అక్కడ ఎక్కువగా రంజాన్ వేడుకలు జరుగుతాయి. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో ఇప్పటి నుండే వేడుకలు మొదలు అయ్యాయి. ఆ కారణంగానే సాహో చిత్రీకరణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సాహో చిత్రం షూటింగ్కు అక్కడ ప్రభుత్వం కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. ఆ అనుమతుల నేపథ్యంలో రంజాన్ అవ్వడం వల్ల షూటింగ్ వీలు పడటం లేదని తెలుస్తోంది. అందుకే రంజాన్ మాసం పూర్తి అయ్యి, రంజాన్ పండగ పూర్తి అయిన తర్వాత అప్పుడు సాహో షూటింగ్ను మళ్లీ అక్కడ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. మరో 20 నుండి 25 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.