ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన రెడ్‌మీ కె20 ప్రొ స్మార్ట్‌ఫోన్

redmi k20 pro smart phone launched in india

రెడ్‌మీ కె20 ప్రొ పేరిట షియోమీ ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ తదితర పవర్‌ఫుల్ ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 20 మెగాపిక్సల్ పాపప్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.27,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.30,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోం స్టోర్‌లలో ఈ నెల 22వ తేదీ నుంచి వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మీ కె20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో 6.39 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 13 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ పాపప్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.