రేణూ దేశాయ్‌ ‘పవర్‌ఫుల్‌ లేడీ’

రేణూ దేశాయ్‌ ‘పవర్‌ఫుల్‌ లేడీ'

‘బద్రి, జానీ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రేణూ దేశాయ్‌ ‘ఆద్య’ అనే ఒక పవర్‌ఫుల్‌ లేడీ ఓరియంటెడ్‌ ప్యాన్‌ ఇండియా చిత్రంతో తన సెకండ్‌ ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుడుతున్నారు. ఈ సినిమాతో ఎం.ఆర్‌. కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రావ్‌. డి.ఎస్‌–రజనీకాంత్‌. ఎస్‌ నిర్మించనున్నారు.

‘హుషారు’ ఫేమ్‌ తేజ కురపాట,, గీతికా రతన్‌ జంటగా నటించనున్న ఈ చిత్రంలో ‘కబాలి’ ఫేమ్‌ సాయి ధన్సిక, నందినీ రాయ్‌ ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌ .ఎస్‌ మాట్లాడుతూ– ‘‘విజయదశమి రోజున మా ‘ఆద్య’ సినిమా ప్రారంభిస్తాం. రేణూ దేశాయ్‌ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అన్నారు. బాలీవుడ్‌ హీరో వైభవ్‌ తత్వవాడి ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర దాశరధి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కృష్ణ చైతన్యరెడ్డి .ఎస్‌.