కేటీఆర్ ను టార్గెట్ చేసిన రేవంత్

revanth reddy fires on ktr over drugs issue

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలంగాణ టీడీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన పంచ్ వేస్తే.. ప్రత్యర్థులైనా రివర్స్ పంచ్ వేయడానికి వారం పడుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. అలాంటి రేవంత్ ఇప్పుడు కేటీఆర్ ను టార్గెట్ చేశారు. డ్రగ్స్ కేసులో అసలు సూత్రధారి ఆయనేనని సంచలన ఆరోపణలు చేశారు. పనిలోపనిగా కేసీఆర్ సర్కారునూ కడిగిపారేశారు.

టీడీపీ హయాంలో ఐటీ హబ్ గా ఉన్న హైదరాబాద్.. ఇప్పుడు క్లబ్బులు, పబ్బులకు అడ్డాగా మారిందని మండిపడ్డారు. గ్లోబల్ సిటీ చేస్తామని చెప్పి డ్రగ్స్ సిటీ చేశారని మండిపడ్డారు. ఆర్భాటంగా కేసు మొదలుపెట్టి.. ఇప్పుడు వాడేవాళ్లంతా బాధితులే అంటే.. ఇక నిందితులెవరని ప్రశ్నించారు రేవంత్. కేటీఆఱ్, ఆయన బావమరిది కలిసి చేసిన బాగోతానికి.. సీఎం ఆయింట్ మెంట్ రాస్తున్నారని ధ్వజమెత్తారు.

కేటీఆర్, బావమరిది రాజేంద్రప్రసాద్ పాకాల కలిసి ఇతర దేశాల్లో నిషేధించిన డీజే షోలను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ అండ్ కంపెనీ డీజే షో లకు 15 ఏళ్ల స్కూలు విద్యార్థుల్ని కూడా అనుమతించి, డ్రగ్స్ అందించారని తాము రుజువు చేశామన్నారు రేవంత్. అన్ని సాక్ష్యాలు ఇచ్చాక కూడా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు ఈ టీడీపీ ఫైర్ బ్రాండ్.

మరిన్ని వార్తలు:

జీవన్‌దాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా పవన్

అంబేద్కర్ అల్లూరికి కులమా… పవన్

చంద్రబాబుతో పవన్ భేటీ.