ఎన్నారైల మనసు దోచిన రేవంత్

Dallas, Detroit,flights for Revanth. Reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి రెండు రాష్ట్రాల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తనవైన చురకలు, చమక్కులతో రేవంత్ జనాన్ని బాగా ఆకట్టుకుంటారు. అందుకే రేవంత్ స్పీచ్ వినడానికి ప్రత్యర్థులు కూడా ఆసక్తి చూపిస్తారు. అలాంటి రేవంత్ ఎన్నారైల కోసం కేంద్రమంత్రికి లేఖ రాసి మరోసారిచర్చకు తెరలేపారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయుల సమస్యపై ఆయన ఫోకస్ చేసిన తీరు.. వారి మనసు దోచేలా ఉంది.

ఇటీవలే నాట్స్ సంబరాలకు అమెరికా వెళ్లిన రేవంత్ రెడ్డి.. అక్కడ బాగానే ప్రోగ్రామ్ ను ఎంజాయ్ చేశారు. అయితే ఆ సమయంలో డల్లాస్, డెట్రాయిట్ లో ఉంటున్న తెలుగు ప్రజలు రేవంత్ ను కలిసి.. తమకు నేరుగా హైదరాబాద్ నుంచి ప్లేన్ లేదని వాపోయారట. పిల్లలు, ముసలివాళ్లతో ప్రయాణం చేసేటప్పుడు ఇబ్బందికరంగా ఉంది చెప్పారట. వెంటనే స్పందించిన రేవంత్ ఇండియా రాగానే.. పౌరవిమానయాన మంత్రి అశోక గజపతి రాజుకు లేఖ రాశారు.

డల్లాస్, డెట్రాయిట్ లో ఉంటున్న వేలాది మంది తెలుగువారి కోసం హైదరాబాద్ నుంచి నేరుగా రెండు ఎయిరిండియా విమానాలు నడపాలని కోరారట. కేంద్రమంత్రిని స్వయంగా కలిసి కూడా విజ్ఞప్తి చేస్తామంటున్నారు రేవంత్. మొత్తం మీద రేవంత్ తెలుగు రాష్ట్రాల్లో జనాల్నే కాకుండా.. అమెరికాలో ఉంటున్న తెలుగువారిని కూడా బాగానే ఆకట్టుకుంటున్నారు.

మరిన్ని వార్తలు

వారంలో రెండు రోజులు ఏడుస్తున్నాడంట.