వైద్యంకోసం వచ్చిన మహిళపై ఆ ఆర్ఎంపీ.. పైత్యం

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోరం జరిగింది. కడుపునొప్పితో బాధపడుతూ వైద్యం కోసం వచ్చిన వివాహితపై ఆర్ఎంపీ డాక్టర్ బలవంతం చేశాడు. టెస్ట్ పేరు చెప్పి గదిలోకి తీసుకెళ్లిన డాక్టర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రజలకు వైద్యం అందిచాల్సిన వైద్యుడే నీచానికి దిగజారాడు.

అయితే కడుపునొప్పితో బాధపడుతూ చికిత్స కోసం వచ్చిన వివాహితపై వైద్యుడు అత్యాచారానికి యత్నించాడు. ఈ దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది. అదే గ్రామానికి చెందిన ఆమెతో వైద్యుడు తప్పుడు కార్యానికి వడిగట్టాడు. ఆమెకు పరీక్షలు చేయాలని చెప్పిన ఆ డాక్టర్ తన సహాయకులిని బయటకు పంపించాడు. ఆ తర్వాత మహిళను గదిలోకి తీసుకెళ్లి గడియ పెట్టాడు. వైద్య పరీక్షల పేరుతో ఆమె శరీర భాగాలను అసభ్యంగా తాకడం స్టార్ట్ చేశాడు.

అతడు దుర్బుద్ధిని అర్థం చేసుకున్న ఆ మహిళ ఆ కీచక డాక్టర్‌ను నెట్టేసి వెంటనే బయటకు పరుగు పెట్టింది. విషయాన్ని తెలుసుకున్న స్థానికులు వెంటనే రాజాం పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో ఆర్ఎంపీ డాక్టర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.