జ్యూవెలరీ షాపుల దోపిడీలో 17 లక్షలు లూటీ

robbery in jewellery shop

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక నగర్‌లో నిన్న రాత్రి మూడు జ్యూవెలరీ షాపుల్లో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. మూడు షాపుల షెట్టర్లను పగులగొట్టిన దొంగలు.. షాపుల్లోని బంగారు నగలను దోచుకెళ్లారు. మూడు షాపుల్లో కలిపి మొత్తం 17 లక్షల రూపాయల విలువైన బంగారు నగలు, వెండి వస్తువులు, నగదును దొంగలు దోచుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. నవీపేట్ ఏరియాలో తాము తీసుకొచ్చిన టాటా సుమో వాహనాన్ని వదిలి.. దోపిడీ ముఠా సభ్యులు పారిపోయారు. టాటా సుమోను వదిలి.. రెండు బైక్‌లను దొంగిలించి ముఠా పారిపోయింది.