బంగారు నగల దుకాణంలో భారీ చోరీ

theft in gold shop at pitlam

కామారెడ్డి: జిల్లాలోని పిట్లంలో గల బంగారు నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. దుకాణం వెనక వైపు గోడ పగులగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించారు. దుకాణంలోని 43.3 తులాల బంగారం, 45.2 కిలోల వెండి చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్‌ టీం, డాగ్‌ స్కాడ్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు అదనపు ఎస్పీ అన్యోన్య తెలిపారు.