కలకలం రేపిన రోజా ఆడియో టేప్

కలకలం రేపిన రోజా ఆడియో టేప్

వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతలు అందరిలో కూడా అద్భుతమైన వాక్చాతుర్యం మరియు ప్రస్తుత రాజకీయాల పట్ల అద్భుతమైన అవగాహన ఉన్నవారిలో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా అందరి కంటే కూడా ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.కొత్తగా వచ్చిన మహిళా నేతల్లా పేపర్లలో ఉన్నది చూసి మాట్లాడారు అప్పటికప్పుడే ఏ పాయింట్ మీద అయినా సరే మాట్లాడగలిగే అవగాహనా రోజా సొంతం దాని మూలంగానే ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ గా రోజా మారారని చెప్పాలి.

కానీ రోజా ఇప్పుడు మాత్రం తన సొంత నియోజకవర్గంలోనే వెన్నుపోటు పొడుస్తున్నారని బయటకొచ్చిన ఆడియో టేప్ కలకలం రేపిన సంగతి అందరికి తెలిసిందే.వారి పార్టీకు చెందిన కార్యకర్తలే తనకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని దీనిపై చర్యలు తప్పకుండా తీసుకోవాలని జగన్ కు విన్నవించుకోగా మొదట తాను ఈ సమస్యను పరిష్కరిస్తానని ధైర్యం చెప్పి మెల్లగా దానిని అసలు పట్టించుకోవడమే మానేశారు అని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు టాక్ వినిపిస్తుంది.మరి ముందు ముందు రోజా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో చూడాలి.