టాప్ రేటింగ్‌లో దూసుకుపోయిన చిరంజీవి మేనల్లుడు

టాప్ రేటింగ్‌లో దూసుకుపోయిన చిరంజీవి మేనల్లుడు

కరోనా వచ్చి అందర్ని ఇంట్లోనే కూర్చొబెట్టింది. కరోనా వైరస్ ధాటికి ప్రపంచం మొత్తం స్థంభించే పరిస్థితి వచ్చేట్టు కనిపిస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో కార్యకలాపాలన్నీ మూలన పడ్డాయి. జనాలు రోడ్ల మీదకు రావొద్దని, ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వాలు సూచించాయి. కరోనాను కట్టడి చేసే భాగంలోనే 21 రోజుల పాటు లాక్ డౌన్‌ను విధించారు.

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తు కొంతమంది రోడ్లపైకి వస్తున్నా.. మెజార్టీ ప్రజలు మాత్రం ఇంటి పట్టునే ఉంటున్నారు. స్టార్ హీరోల నుంచి సామాన్య జనాల వరకు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా టీవీలకు అతుక్కపోయారు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోని సినిమాలను వీక్షిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇంకొంత మంది కుటుంబంతో సరదాగా ముచ్చటిస్తూ సమయాన్ని గడిపేస్తున్నారు.

అందరూ ఇంటి పట్టునే ఉండటంటో టీఆర్పీ రేటింగ్స్ ఓ రేంజ్‌లో వస్తున్నాయి. ఈ క్రమంలోనే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం టాప్ రేటింగ్‌లో దూసుకుపోయింది. టాలీవుడ్ చరిత్రలోనే అంతటి రేటింగ్ మరే చిత్రానికి రాలేదు. తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విషయంలోనూ అదే జరిగింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజు పండగే చిత్రం సుప్రీమ్ హీరో కెరీర్‌లోనే టాప్ రేటింగ్ గా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది.