మల్టీస్టారర్‌లో రకుల్‌, సాయి పల్లవి ఫిక్స్‌

sai-pallavi-and-rakul-in-di

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఈ సంవత్సరంలో దిల్‌రాజు బ్యానర్‌లో వచ్చిన అన్ని చిత్రాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈనెల 21న నాని, సాయి పల్లవి జంటగా నటించిన ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ చిత్రం కూడా విడుదల కాబోతుంది. ఆ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో అంతా ఉన్నారు. ఇంతటి భారీ సక్సెస్‌ ట్రాక్‌ ఉన్న దిల్‌రాజు ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే మల్టీస్టారర్‌ చిత్రంలో హీరోలుగా నితిన్‌ మరియు శర్వానంద్‌లను ఎంపిక చేయడం జరిగింది. త్వరలోనే ఆ సినిమాను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

nithin-and-sharwanand-multi

మల్టీస్టారర్‌ చిత్రంలో హీరోయిన్స్‌ను తాజాగా ఎంపిక చేయడం జరిగింది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మరియు సాయి పల్లవిలను ఎంపిక చేయబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్స్‌గా ఉన్నారు. ముఖ్యంగా సాయి పల్లవి చిత్రా కోసం తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ చిత్రంపై సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. సాయి పల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు ఒకే చిత్రంలో నటించనుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.