తమిళ సినీ పరిశ్రమలో సంచలన నిర్ణయం.. స్టార్ హీరోలు ఒప్పుకుంటారా?

తమిళ సినీ పరిశ్రమలో సంచలన నిర్ణయం.. స్టార్ హీరోలు ఒప్పుకుంటారా?
తమిళ సినీ పరిశ్రమలో సంచలన నిర్ణయం.. స్టార్ హీరోలు ఒప్పుకుంటారా?

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాల నిర్మాణ విధానంపై తమిళ చిత్ర పరిశ్రమలో కొంతకాలంగా విస్తృత చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తమిళ చిత్ర నిర్మాతల మండలి ఓ కీలకమైన, సంచలన నిర్ణయం తీసుకుంది.

భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించే స్టార్ హీరోలు ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ తీసుకోవడం కంటే, రెవెన్యూ షేరింగ్ మోడల్‌లో పారితోషికం స్వీకరిస్తే ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని మండలి అభిప్రాయపడింది. ఈ విధానం వల్ల నిర్మాతలపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, సినిమాపై హీరోల భాగస్వామ్యం మరింత పెరుగుతుందని వారు భావిస్తున్నారు. అయితే ఈ రెవెన్యూ షేరింగ్ మోడల్‌ను టీఎఫ్‌పీసీ ప్రతిపాదించడం ఇదే మొదటిసారి కాదు.

గత ఏడాదిలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ, అది అమలులోకి రాలేదు. స్టార్ హీరోల అంగీకారం లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా అప్పట్లో చర్చ జరిగింది. ఈసారి అయినా ఆ నిర్ణయం కార్యరూపం దాలుస్తుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదే సమయంలో, థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత సినిమాలను ఓటీటీలో విడుదల చేసే అంశంపై కూడా నిర్మాతల మండలి మరో కీలక తీర్మానం చేసింది. తాజా నిర్ణయం ప్రకారం, సినిమా విడుదలైన తర్వాత కనీసం 6 నుంచి 8 వారాల పాటు ఓటీటీ స్ట్రీమింగ్‌కు అనుమతి ఉండదు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల విషయంలో మాత్రం తప్పనిసరిగా 8 వారాల గ్యాప్ పాటించాల్సిందేనని కఠినంగా స్పష్టం చేసింది.