ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు

AP Cabinet Key Decisions

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 3 గంటల పాటు సాగిన ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆ ఆర్డినెన్స్‌ ద్వారా జిల్లాలవారీగా జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తారు. వేట నిషేధకాలంలో మత్స్యకారులకు ఇచ్చే సాయం 20 వేలకు పెంచింది ప్రభుత్వం. ఏప్రిల్ 26న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.