కరోనా నుంచి కోలుకున్నహీరోయిన్ శ్రేయ భర్త

కరోనా నుంచి కోలుకున్నహీరోయిన్ శ్రేయ భర్త

మన టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోల నుంచి ఇప్పుడు స్టార్ హీరోల వరకు నటించిన హీరోయిన్స్ లో హీరోయిన్ శ్రేయ కూడా ఒకరు. అయితే శ్రేయ హీరోయిన్ గా సినిమాలు తియ్యడం ఆపేసాక బార్సిలోనా టెన్నిస్ ఆటగాడు ఆండ్రిను 2018 లో వివాహం చేసుకొని స్పెయిన్ లోనే సెటిల్ అయ్యిపోయారు.

అయితే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి స్పెయిన్ లో కూడా తీవ్ర రూపం దాల్చింది. దీనితో గత కొన్ని రోజుల క్రితం ఆండ్రి పొడి దగ్గు,తలనొప్పి మరియు జ్వరంతో బాధ బాధ పడగా అది కాస్తా కరోనా పాజిటివ్ అని తేలింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో టచ్ లో ఉండే శ్రేయ ఈ విషయాన్ని కాస్త మెల్లగానే వెల్లండించారు.

కాకపోతే తన భర్త కరోనా నుంచి కోలుకున్న తర్వాతే ఈ విషయాన్ని ఆనందంగా పంచుకున్నట్టు తెలుస్తుంది. కరోనా లక్షణాలు కనిపించిన తర్వాత సరైన వైద్యం తీసుకోగా అతనికి తగ్గిపోయింది. దానితో మళ్ళీ వారి ఇంటికి డిశ్చార్జ్ కావడంతో శ్రేయ ఈ విషయాన్ని తెలిపారు