టెన్షన్: సీఎం పీఏ కరోనాతో మృతి… ఆఫీస్ లో టెన్షన్

తమిళనాడులో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకీ విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి. అలాగే.. ఆ రాష్ట్రంలో వీవీఐపీల్లో టెన్ష‌న్ పుట్టిస్తోంది క‌రోనా. ముఖ్యంగా ఈరోజు త‌మిళ‌నాడులో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి దామోదరన్ క‌రోనా వైర‌స్ బారినప‌డి మృత్యువాత పడ్డారు.

అదేవిధంగా చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయ‌న చ‌నిపోయాడు. అత్యున్నత స్థాయి అధికారే క‌రోనాతో చనిపోవడంతో సీఎంవోలో క‌ల‌వ‌రం పట్టుకుంది. ఆయ‌న సీఎం ప‌ళ‌నిస్వామి.. సీనియర్ వ్యక్తిగత కార్యదర్శిగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఆయ‌న‌ కుటుంబ సభ్యులు సైదాపేటలోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై సెక్రటేరియట్ ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా సెక్రటేరియట్‌ను మూసివేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.