కరోనాతో బురుండీ దేశాధ్యక్షుడు మృతి ..?

బురుండీ దేశాధ్యక్షుడు ఎన్ కురుంజిజా గుండెపోటుతో హఠాన్మరణం చెందారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆయన వయసు 55 సంవత్సరాలు. గత శనివారం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. సోమవారం నాడు కోలుకున్నారని వైద్యులు ప్రకటించారు. అయితే వెంటనే ఆయనకు గుండెపోటు వచ్చిందని.. డాక్టర్లు ఆయన్ను కాపాడేందుకు విఫలయత్నం చేసినా ఫలితం లభించలేదని అధికారులు వెల్లడించారు.

 ఆయన కరోనాతో మరణించారని పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అదే సమయంలో కురుంజియా భార్య డెనిస్ కు కరోనా సోకింది. ఆమె ప్రస్తుతం కెన్యాలో ఉన్న అగాఖాన్ యూనివర్శిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. దీంతో కురుంజిజా కూడా కరోనాతోనే మరణించి ఉండవచ్చని సమాచారం అందుతుంది. మరి ఏంటి అనేది తెలియాల్సి ఉంది.