పుకార్లపై గాయని సుశీలమ్మ క్లారిటీ

singer-susheela-clarifies-a

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్నో అద్బుతమైన పాటలను పాడిన గాయని సుశీల గారు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆమె ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. ఇక కొందరు అయితే సుశీల గారు ఇక లేరు అంటూ చెత్త వ్యాఖ్యలు, పోస్ట్‌లు కూడా చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో సుశీలమ్మ గారి గురించి వార్త వైరల్‌ అయ్యింది. ఆమె అభిమానులు మరియు సినీ వర్గాల వారు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు. దాంతో సుశీలమ్మ స్వయంగా ఒక వీడియో సందేశంను విడుదల చేసి, తాను ఆరోగ్యంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.

susheela

సుశీల గారు అనారోగ్యంతో ఉన్నారు అంటూ వచ్చిన వార్తలపై మొదట ఎస్పీబాలసుబ్రమణ్యం స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఆమె ఆరోగ్యం బాగుందని, పుకార్లు నమ్మొదు అంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టడం జరిగింది. ఆ తర్వాత కొద్ది సమయానికి సుశీల గారు స్వయంగా తాను బాగున్నాను అని, తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు అంటూ వీడియో సందేశంలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను అమెరికాలో ఉన్నాను అని, హాయిగా జీవితాన్ని సాగిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇలాంటి పుకార్లు పుట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇలాంటి పుకార్లు రాకుండా ఉండాలని కోరుకుంటున్నట్లుగా సుశీలమ్మ అభిమానులు పోలీసులను కోరుతున్నారు.