విజయవాడ గోవుల మృతి మీద సిట్

SIT on the death of Vijayawada cows death

విజయవాడలోని శివారు కొత్తూరు తాడేపల్లి‌లోని గోశాలలో ఆవుల మృతి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఒక్కరాత్రిలో 100కిపైగా ఆవులు మృత్యువాత పడటంతో అది రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

శ్రావణ శుక్రవారం రోజున పెద్ద సంఖ్యలో మహిళలు ఆవులకు ఆహారం తినిపించారని, వాటిలో విష పదార్ధాలేవైనా ఉన్నాయో అన్న కోణంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అయితే ఆవులను పోస్టుమార్టం చేసిన డాక్టర్లు విష ప్రయోగం జరగలేదని, అయితే ఆవుల లోపలి శరీర భాగాల్లో రక్తపు చారికలు ఉన్నాయని చెప్పడంతో ఎటూ తేల్చుకోలేని ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసింది. సిట్ టీమ్‌కు సీసీఎస్‌ ఏసీపీ శ్రీనివాసరావు నేతృత్వం వహించనున్నారు.

ఈ టీమ్‌లో సీసీఎస్‌ సీఐ చలపతిరావు, రెండో పట్టణ సీఐ ఉమర్‌, ఎస్సై శేఖర్‌బాబు, టాస్క్‌ఫోర్స్‌ ఎస్సై అర్జున్‌, సైబర్‌క్రైం ఎస్సై దీపిక సభ్యులుగా ఉన్నారు. సిట్ ఆవుల మృతికి సంబంధించి అన్ని అంశాలను పరిశీలించి రోజువారీ నివేదికను విజయవాడ జాయింట్ కమిషనర్ నాగేంద్రకుమార్‌కు అందజేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు.