కన్న కూతురుని రూ.50 వేలకు అమ్మేశాడు

ఆంధ్రప్రదేశ్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే… తన కూతురిని అమ్మకానికి పెట్టేశాడు.ఈ ఘోరమైన వినకూడని ఘటన చిత్తూరు జిల్లా ప్రజలకు షాక్ కి గురిచేసింది. అసలేం జరిగింది అంటే.. జిల్లాలోని పెద్దపంజాణి మండలం ముదరంపల్లికు చెందిన వెంకటరమణ అనే వ్యక్తి.. పందులు పెంచుతూ జీవితాన్ని గడుపుతుంటాడు. అతడికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే… వీరిలో ఇద్దరికి పెళ్లిళ్లు చేశాడు. బైరెడ్డిపల్లి మండలం చప్పిడిపల్లికి చెందిన సురేష్‌ గతంలో వెంకటరమణ పెద్ద కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అది కుదరక పోవడంతో.. రెండో కుమార్తెను ఇవ్వమని కోరాడు. ఆమెకు కూడా పెళ్లి చేసేయడంతో ఇక మూడో కూతురుపై కన్నుపడింది. 12 ఏళ్ల మూడో కూతురుపై కన్నేసిన ఆయన తనకి ఇచ్చి పెళ్లి చేయాలనీ… అందుకోసం రూ.50 వేలు ఎదురు కట్నంగా ఇస్తానని ఎరేశాడు. దీంతో.. రహస్యంగా.. పెళ్ళిచేయడానికి తండ్రి ఒప్పేసుకున్నాడు.

అయితే అక్కడే స్టోరీ తికమక అయింది. తన 12 ఏళ్ళ కూతురు పెళ్లికి ఏర్పాట్లన్నీ రహస్యంగా కానిచ్చేశాడు. డబ్బులు తీసుకొని కుమార్తెను సురేష్‌కి ఇచ్చి రహస్యంగా పెళ్లి చేయాలని ఆలోచించాడు. కానీ.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. పెళ్లి ఆగిపోయింది. దీంతో అప్పటికే డబ్బులు తీసుకున్న వెంకటరమణ.. పెళ్లి కాకపోతే తనకు ఇబ్బందులు ఎదురవుతాయని.. ఎవ్వరికీ తెలియకుండా.. తన కుమార్తెను సురేష్‌ వెంట పంపించేశాడు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా అధికారులు దృష్టి సారించారు. కన్న తండ్రే… రూ.50వేలకోసం ఇంత దారుణానికి ఒడిగట్టారని స్థానికంగా కలకం రేగుతుంది. మరి ఈ ఘటన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది వేచి చూడాలి.