కిరాతకం: కన్న తల్లినే సాకలేక కడతేర్చాడు..

కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం

తెలంగాణలోని నల్లగొండ జిల్లాలా ఘోరం చోటు చేసుకుంది. నల్లగొండ మండలం నర్సింగ్‌బట్ల గ్రామంలో విషాదం అలముకుంది. కన్న కొడుకే తల్లి పట్ల కాలయముడుగా మారాడు. కన్నకొడుకే మంచంపట్టిన తల్లి ఒంటిపై కిరోసిన్‌ పోసేసి నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అక్కడ ఊరులోని తిరుమల శాంతమ్మ అనే మహిళ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో కొడుకు లింగస్వామి తల్లి శాంతమ్మను ఇంటి వద్దే వదిలి హైదరాబాద్‌లో కూలీ పనిచేసుకుంటూ గడుపుతున్నాడు. పది రోజుల క్రితం కొడుకు లింగస్వామి గ్రామానికి వచ్చాడు.

అయితే వచ్చీ రావడంతో ఏదో మనసులో పెట్టుకొని తల్లిని ఏమైనా చేయాలని ప్లాన్ వేశాడు. దాంతో అంతా నిద్రిస్తున్న అర్థిరాత్రి సమయంలో తన తల్లిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించేశాడు. మంటల్లో శాంతమ్మ సజీవదహనమైంది. నిజంగా తల్లిని సాకలేక అలాంటి ఘోరానికి పాల్పడినట్లు స్థానికంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎంతైనా తల్లిని చంపుకుంటావా అంటూ జనాలు కొడుకును చీదరించుకుంటున్నారు.