Sports: నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్.. 353 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్

Sports: First innings of the fourth Test.. England all out for 353 runs
Sports: First innings of the fourth Test.. England all out for 353 runs

భారత్ తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 353 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్నైట్ 302/7తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ను ఆల్రౌండర్ జడేజా దెబ్బకొట్టాడు. అర్ధశతకం సాధించిన రాబిన్సన్(58)ను, ఆ తర్వాత షోయబ్ బషీర్ను ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. జేమ్స్ అండర్సన్ కూడా జడేజా బౌలింగ్లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. జోరూట్ శతకం తో(122) నాటౌట్గా నిలిచాడు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ 1 వికెట్ తీశారు.