Sports: ఢిల్లీ క్యాపిటల్స్ కు గుడ్ న్యూస్.. రిషబ్ పంత్ రీఎంట్రీ

Sports: Good news for Delhi Capitals.. Rishabh Pant re-entry
Sports: Good news for Delhi Capitals.. Rishabh Pant re-entry

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో ఢిల్లీ క్యాపిటల్స్ కు గుడ్ న్యూస్ అందింది. వికెట్ కీపర్ రిషభ్ పంత్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో ఆయన బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ జట్టుకు ఆయన తిరిగి నాయకత్వం వహించనున్నారు. వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి తప్పుకుని, కేవలం బ్యాటర్ గానే కొనసాగనున్నారు. 2022 డిసెంబర్లో పంత్ కారు యాక్సిడెంట్కు గురై దాదాపు  ఏడాదిన్నరపాటు క్రికెట్కు దూరమయ్యారు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఫిట్ నెస్ నిరూపించుకునే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు తన రికవరీ ప్రక్రియ గురించి అభిమానులకు సోషల్ మీడియా లో పంచుకొని త్వరలోనే క్రికెట్ లోకి అడుగుపెడతాడని సంకేతం ఇచ్చాడు.మళ్లీ ఇన్నాళ్లకు బ్యాట్ పట్టనున్నారు.

పంత్ ఐపీఎల్ 2024లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో 98 మ్యాచ్‌లు ఆడి 2838 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 15 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే, అతని ఖాతాలో ఆరు రనౌట్లు, 18 స్టంపింగ్‌లు,64 క్యాచ్‌లు ఉన్నాయి.