Sports: ఇంగ్లాండ్​తో టెస్ట్ సిరీస్​కు భారత్ జట్టు ప్రకటన

Sports: India team announcement for Test series with England
Sports: India team announcement for Test series with England

ఏడాది టీమిండియా వరుసగా చాలా సిరీస్ లు ఆడనుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాతో టి20 లు మరియు వన్డేలు అలాగే టెస్టులు ఆడిన టీమిండియా జట్టు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో టి20 లో ఆడుతోంది. ఇక త్వరలోనే ఇంగ్లాండ్ జట్టుతో కూడా టెస్టులు ఆడనుంది టీమిండియా.

ఈ తరుణంలో ఇంగ్లాండ్తో జరగనున్న తొలి రెండు టెస్టులకు బీసీసీఐ… భారత జట్టును ప్రకటించింది. మొత్తం ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఈనెల 25వ తేదీ నుంచి హైదరాబాద్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.

ఇంగ్లండ్‌తో జరగనున్న తొలి రెండు టెస్టులకు టీమిండియా జట్టును ప్రకటించారు
టీమిండియా జట్టు : రోహిత్ శర్మ (C ), S గిల్, Y జైస్వాల్, విరాట్ కోహ్లీ, S అయ్యర్, KL రాహుల్ (wk), KS భరత్ (wk), ధృవ్ జురెల్ (wk), R అశ్విన్, R జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (VC), అవేష్ ఖాన్