Sports: జితేశ్ శర్మ, దూబే అద్భుతంగా ఆడుతున్నారు: రోహిత్ శర్మ

Sports: Jitesh Sharma, Dubey playing brilliantly: Rohit Sharma
Sports: Jitesh Sharma, Dubey playing brilliantly: Rohit Sharma

ఆఫ్ఘనిస్తాన్ తో తొలి టీ20 లో జితేష్ శర్మ, శివమ్ దూబే అద్భుతంగా ఆడారని కెప్టెన్ రోహిత్ శర్మ కొనియాడారు. తిలక్ వర్మ, రింకు సింగ్ తో పాటు పెసర్లు, స్పిన్నర్లు మంచి ప్రదర్శన చేశారని చెప్పారు. మ్యాచ్ లో తన రనౌట్ పై స్పందిస్తూ…. “ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఆటగాడు జట్టు విజయంలో భాగం కావాలనుకుంటాడు. దురదృష్టవశాత్తు రనౌట్ అయితే నిరాశకు గురవుతాడు. ఏది ఏమైనాపటికి మేము గెలిచాం” అని తెలిపారు.

కాగా, అఫ్గానిస్తాన్ తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇండియా విజయంతో ఆరంభించింది. మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో అఫ్గానిస్తాన్ నిర్దేశించిన 159 రన్స్ లక్ష్యాన్ని ఇండియా.. 17.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. జితేశ్‌ శర్మ (31), శివమ్‌ దూబే (60 నాటౌట్‌), తిలక్‌ వర్మ (26) రాణించడంతో ఇండియా బోణీ చేసింది.