Sports: ముగిసిస రెండో రోజు ఆట.. దూకుడుగా ఇంగ్లాండ్

Sports: The second day's game is over.. England aggressively
Sports: The second day's game is over.. England aggressively

రాజ్కోట్ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ దూకుడుగా ఆడుతోంది. రెండో రోజు ఆట ముగిసేసరికి పర్యటక జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. క్రీజ్లో బెన్ డకెట్ (133*), జో రూట్ (9*) ఉన్నారు. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఒలీ పోప్ 39, జాక్ క్రాలే 15 పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్, అశ్విన్ చెరో వికెట్ తీశారు.

క్రాలేను ఔట్ చేసిన అశ్విన్ టెస్టుల్లో 500వ వికెట్ తీసిన తొమ్మిదో బౌలర్గా అవతరించాడు. అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ ఇంకా 238 పరుగులు మాత్రమే వెనకబడి ఉంది.