రీషూట్‌.. అందుకే ఫిదా చేయలేక పోతున్నారు!

Srinivasa Kalyanam Postponed Due To ReShoot

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దిల్‌రాజు బ్యానర్‌లో వరుణ్‌ తేజ్‌, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫిదా’. గత సంవత్సరం జులై 21న ఫిదా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా దిల్‌రాజు బ్యానర్‌లో గత సంవత్సరం బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను దక్కించుకుంది. దాంతో పాటు భారీ లాభాలు తెచ్చి పెట్టిన చిత్రంగా కూడా నిలిచింది. అంతటి విజయాన్ని సొంతం చేసుకున్న ఫిదా డేట్‌కు తాజాగా దిల్‌రాజు నిర్మిస్తున్న శ్రీనివాస కళ్యాణంను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. మొన్నటి వరకు ఫిదా డేట్‌కు సినిమాను తీసుకు రావాలని దిల్‌రాజు ఉవ్విల్లూరాడు. కాని తాజాగా ఆగస్టుకు సినిమా వాయిదా వేసినట్లుగా ప్రకటించారు.

సినిమా చిత్రీకరణ ఆస్యం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నప్పటికి కారణం మరోటి ఉందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినిమా చిత్రీకరణ అంతా సాఫీగానే సాగుతుంది. కాని కొన్ని సీన్స్‌ దిల్‌రాజుకు నచ్చలేదని, ఆ కారణంగా ఆ సీన్స్‌ను రీషూట్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ రీ షూట్‌ కనీసం 15 రోజుల పాటు పట్టే అవకాశం ఉంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. దిల్‌రాజు సినిమాల విషయంలో అస్సలు చాన్స్‌ తీసుకోడు. ఏదైనా డౌట్‌ ఉంటే ఖచ్చితంగా సినిమాను వాయిదా వేసి తీరుతాడు. నితిన్‌, రాశిఖన్నా జంటగా నటిస్తున్న శ్రీనివాస కళ్యాణంపై సినీవర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది.