ఆర్‌ మల్టీస్టారర్‌ షూటింగ్‌ అప్‌డేట్స్‌…!

SS Rajamouli Next Movie Shooting Begins Next Month

జక్కన్న రాజమౌళి సంవత్సర కాలంగా ఊరిస్తూ వస్తున్న రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్‌ మూవీని వచ్చే నెలలో పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెలలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లపై పది రోజుల పాటు హైదరాబాద్‌ శివారులో వేసిన అల్యూమీనియం ఫ్యాక్టరీలో సెట్టింగ్‌లో చిత్రీకరణ జరుపబోతున్నారు. ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలు అన్ని కూడా ఆ సెట్స్‌లోనే చిత్రీకరించబోతున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం షూటింగ్‌ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న మెగా, నందమూరి అభిమానులకు ఇదో పెద్ద శుభవార్తగా చెప్పుకోవచ్చు.

rrr-rajamouli

దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ లు దాదాపు 200 రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. వచ్చే నెల రెండవ వారంలో చిత్రాన్ని ప్రారంభించి పది రోజుల పాటు ఇద్దరి కాంబోలో సీన్స్‌ చిత్రీకరిస్తారు. ఆ తర్వాత వారం గ్యాప్‌ తీసుకుని ఎన్టీఆర్‌తో సోలోగా సీన్స్‌ చిత్రీకరిస్తారు. ఆ గ్యాప్‌లో రామ్‌ చరణ్‌ తన బోయపాటి మూవీని పూర్తి చేయబోతున్నాడు. వచ్చే ఏడాది మొత్తం ఈ చిత్రం షూటింగ్‌ కోసమే చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ లు డేట్లు కేటాయించారు. 2020లో సినిమాను జక్కన్న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. మరో వైపు ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్‌ నటిస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ ముగ్గురి ఎంపిక కూడా ఇంకా కాలేదు. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Ram Charan and NTR Select as Mobile Brand Ambassador