స్కూల్లో భోజనం చేసి అస్వస్థులైన విద్యార్థులు

స్కూల్లో భోజనం చేసి అస్వస్థులైన విద్యార్థులు

మధ్యాహ్న భోజనం తిని ఒక ప్రాథమిక పాఠశాలకు చెందిన 60 మందికి పైగా విద్యార్థులు అస్వస్థులయ్యారు. చిత్రదుర్గలో బుధవారం ఈ సంఘటన జరిగింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న వెంటనే పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారు. దీంతో వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందచేస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఇటువంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లి పట్టణంలో చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం తిని రామకృష్ణ మిషన్ స్కూలుకు చెందిన 20 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. భోజనం తిన్న తర్వాత వాంతులు చేసుకున్న విద్యార్థులు స్పృహ కోల్పోవడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.