సుధీర్‌బాబు ఒడ్డున పడ్డట్లే..!

Sudheer Babu Happy With Nannu Dochukunduvate Success

మహేష్‌బాబు బావ సుధీర్‌బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది. ఇన్నాళ్లకు సుధీర్‌బాబుకు సక్సెస్‌లు దక్కుతున్నాయి. సుధీర్‌బాబు గత చిత్రం ‘సమ్మోహనం’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆ చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకున్న సుధీర్‌బాబు తాజాగా ‘నన్ను దోచుకుందువటే’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రాన్ని నాయుడు దర్శకత్వంలో సుధీర్‌బాబు స్వయంగా నిర్మించాడు. ఎస్‌బి ప్రొడక్షన్స్‌ను స్థాపించి సుధీర్‌బాబు నిర్మించిన ఈ చిత్రం నిర్మాతగా ఆయనకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. తాజాగా సినిమా విడుదలై పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకోవడంతో సుధీర్‌బాబు ఊపిరి పీల్చుకున్నాడు.

Nannu Dochukunduvate Movie Review

‘నన్ను దోచుకుందువటే’ చిత్రం షూటింగ్‌ మద్యలో ఉన్న సమయంలో నిర్మాత ఆర్థిక ఇబ్బందుల వల్ల తప్పుకున్నాడు. దాంతో నిర్మాత స్థానంను సుధీర్‌బాబు భర్తీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే నన్ను దోచుకుందువటే చిత్రానికి నిర్మాతగా మారాడు. కథ మరియు దర్శకుడిపై నమ్మకంతో ఈ చిత్రాన్ని చేసిన సుధీర్‌బాబు నమ్మకం వమ్ము కాలేదు. ఈ చిత్రానికి పాజిటివ్‌టాక్‌ వస్తున్న నేపథ్యంలో పెట్టిన పెట్టుబడి రావడం ఖాయం అంటూ ట్రేడ్‌ వర్గాల వారు చెబుతున్నారు. ఈ చిత్రం మంచి ఎంటర్‌టైనర్‌గా ఉందని, తప్పకుండా సుధీర్‌బాబు కెరీర్‌లో ఒక మైలురాయి చిత్రంగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్నట్లుగానే మంచి వసూళ్లు రాబడుతూ ఉంది. ఈ చిత్రంకు పోటీగా విడుదలైన సామి మరియు ఇతర చిత్రాలు ఆకట్టుకోలేక పోతున్నాయి. దాంతో ఈ చిత్రంకు పోటీ లేకుండా పోయింది. నిర్మాతగా మొదటి సినిమా సక్సెస్‌ అవ్వడంతో వరుసగా సుధీర్‌బాబు సినిమాలను నిర్మిస్తాడేమో చూడాలి.