సుధీర్‌ బాబు మళ్లీ సక్సెస్‌

మహేష్‌ బాబు బావ సుధీర్‌ బాబు గత చిత్రం సమ్మోహనంతో మంచి విజయాన్ని దక్కించుకున్న విషయం తెల్సిందే. సక్సెస్‌ ఇచ్చిన జోష్‌తో సొంతంగా ఒక బ్యానర్‌ను స్థాపించి చిత్రాలను నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. తన సొంత బ్యానర్‌లో ఎస్‌బి బ్యానర్‌లో సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ఒక యావరేజ్‌ సక్సెస్‌గా ఈ చిత్రం టాక్‌ను దక్కించుకుంది. దాంతో ఈ చిత్రం వసూళ్ల కూడా బాగా వస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

Sudheer Babu invites public reviews

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కేవలం 10 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కింది. విడుదలకు ముందు 6.5 కోట్లకు అమ్ముడు పోయిన ఈ చిత్రం విడుదల తర్వాత మంచి వసూళ్లను రాబట్టడంతో 10 కోట్ల వరకు షేర్‌ను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. థియేట్రిల్‌ రైట్స్‌తో పాటు ఇతర రైట్స్‌ ద్వారా మరో అయిదు కోట్ల మేరకు నిర్మాత సుధీర్‌బాబు దక్కించుకున్నట్లుగా కూడా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. మొత్తంగా ఈ చిత్రంతో అయిదు కోట్ల లాభంను మరియు ఒక మంచి సక్సెస్‌ను సుధీర్‌బాబు దక్కించుకున్నాడు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం సినిమా పలు ఏరియాల్లో మంచి వసూళ్లను రాబడుతూనే ఉంది.