ప్రభాస్‌తో గొడవపై సుజీత్‌ ఇలా స్పందించాడు

sujeeth gives clarity about clash with Prabhas

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఈమధ్య సోషల్‌ మీడియాలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి సినిమాపై, ప్రతి దర్శకుడు, హీరోపై పుకార్లు వస్తూనే ఉన్నాయి. అప్పట్లో గొడవ కొద్దిగా ఉంటే ఎక్కువ చేసి చూపించే వారు. ఇప్పుడు అసలు గొడవ లేకున్నా కూడా పుట్టిస్తున్నారు. తాజాగా సోషల్‌ మీడియాలో ‘సాహో’ చిత్ర దర్శకుడు సుజీత్‌కు ప్రభాస్‌తో చెడ్డట్లుగా పుకార్లు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఈ విషయమై కాస్త అతిగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దర్శకుడు సుజీత్‌ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ట్విట్టర్‌లో ఒక వ్యక్తి ప్రభాస్‌ వర్సెస్‌ సుజీత్‌ అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి ఉందని, సుజీత్‌ను తన పని తాను చేసుకోనివ్వడం లేదు అంటూ ప్రభాస్‌ గురించి పోస్ట్‌ పెట్టాడు.

ఈ పోస్ట్‌కు రీప్లైగా దర్శకుడు సుజీత్‌ పోస్ట్‌ చేశాడు. ‘సాహో’ చిత్రం చాలా బాగా చిత్రీకరణ జరుగుతుంది. అనుకున్నదాని కంటే ఎక్కువ స్పీడ్‌గా చిత్రీకరణ జరుగుతుంది. అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు వస్తుంటే మాకు ఎంటర్‌టైనర్‌గా ఉందన్నాడు. ఇలాంటి సరదా పుకార్లు శృతిమించకుంటే బాగుంటుందని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. సుజీత్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో వంశీ మరియు ప్రమోద్‌లు దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతుంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇంకా పలువురు స్టార్స్‌ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. బాలీవుడ్‌ రేంజ్‌లో ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమా వచ్చే అవకాశం ఉంది.