ఎట్టకేలకు గుమ్మడి కాయ కొట్టేశారు

Sukumar finished the item song with Pooja Hegde today

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంగస్థలం’ చిత్రం షూటింగ్‌ సాగతీస్తూ వచ్చారు. చాలా నెలల క్రితమే షూటింగ్‌ పూర్తి చేసి దసరా లేదా దీపావళికి విడుదల చేయాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల సినిమాను నవంబర్‌లో పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. సంక్రాంతికి పవన్‌ కళ్యాణ్‌ చిత్రం విడుదల అయిన నేపథ్యంలో మార్చికి చిత్రాన్ని వాయిదా వేశారు. సినిమా విడుదలకు చాలా సమయం ఉందనే ఉద్దేశ్యమో లేక మరేమో కాని నేటి వరకు షూటింగ్‌ చేస్తూనే ఉన్నారు. నేడు పూజా హెగ్డేతో ఐటెం సాంగ్‌ను పూర్తి చేసిన సుకుమార్‌ షూటింగ్‌కు గుమ్మడి కాయ కొట్టేశాడు.

షూటింగ్‌ పూర్తి అవ్వడంతో పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో సుకుమార్‌ నిమగ్నం కానున్నాడు. 80లలో తెరకెక్కిన చిత్రంగా ఈ చిత్రాన్ని చూపించేలా దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడు. అందుకోసం కలెర్‌ కరెక్షన్‌ విషయంలో ఎక్కువ శ్రద్ద తీసుకుంటున్నాడు. అలాగే ఎక్కువ సీన్స్‌లలో విజువల్‌ ఎఫెక్ట్స్‌తో మాయ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి రామ్‌ చరణ్‌, సుకుమార్‌లు ఈ చిత్రం కోసం సుదీర్ఘ నెలల పాటు కష్టపడుతూ వస్తున్నారు. ఎక్కడ రాజీ పడకుండా, సుకుమార్‌కు పూర్తి స్వేచ్చ ఇచ్చి మైత్రి మూవీస్‌ వారు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

తాజాగా విడుదలైన సమంత రామలక్ష్మి టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేస్తామని, మార్చి మొదటి వారంలో ఆడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మార్చి 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం సినిమాకు హైలైట్‌ అవుతుందనే నమ్మకంను సినీవర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.