ఆదోని పట్టణంలో బుధవారం అర్థరాత్రి రాజీవ్ గాంధీ నగర్లో నివాసం ఉంటున్న మాదిగ హరిబాబు అనే 22 ఏళ్ల వాలంటీర్ దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం ఉదయం అతని మృతదేహం లభ్యమైంది.
హరిబాబు భరత్ నగర్ సచివాలయం పరిధిలో వాలంటీర్గా పనిచేస్తున్నారు. రాళ్లు, మారణాయుధాలతో అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఈ దాడికి పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో తేలింది. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు కాగా, సంఘటన జరిగినప్పుడు రాత్రి ఇంటి నుంచి వెళ్ళాడు.
నేరం వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు ఆదోని డీఎస్పీ జె.శివన్నారాయణ స్వామి ధృవీకరించారు. స్థానిక టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ దారుణ హత్యకు గల కారణాలు తెలియరాలేదని డీఎస్పీ తెలిపారు.