ఆఫ్ఘనిస్తాన్ లో వైమానిక దాడి

ఆఫ్ఘనిస్తాన్ లో వైమానిక దాడి

కంధర్ ప్రావిన్స్‌లోని జెరాయ్ జిల్లాలో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ రక్షణ దళాలు జరిపిన వైమానిక దాడిలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. గత 24 గంటల్లో అనేక ప్రధాన నగరాల్లో జరిగిన ఈ ఘటనల్లో కనీసం 250 మంది తిరుగుబాటుదారులు మరణించగా, దాదాపు 100 మంది గాయపడినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. కాగా తాబిబన్లు ఆప్ఘనిస్తాన్‌లో ఆక్రమించుకున్న గ్రామీణ భూభాగంలో ప్రాంతాలను వారు స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాకుండా కీలక సరిహద్దు క్రాసింగ్‌లను స్వాధీనం చేసున్నారు. ఆ తరువాత తాలిబన్లు ఉండే ప్రావిన్షియల్ రాజధానులను ముట్టడించారు. ఇక శనివారం రాత్రి ఆప్ఘనిస్తాన్‌ ప్రభుత్వం కంధర్‌లోని విమానాశ్రయంపై మూడు రాకెట్లను ప్రయోగించింది. విమానాశ్రయంపై దాడి, లాజిస్టికల్, ఎయిర్ హెల్ప్ కోసం చాలా ముఖ్యమైన ఈ ప్రాంతాన్ని తాలిబన్ల భారీ నుంచి కాపాడుకోవాలనుకున్నారు. అయితే ఇక్కడ ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను యధేచ్చగా సాగిస్తున్నారు. ప్రస్తుతం హెల్మాండ్ ప్రావిన్స్‌లోని లష్కర్ గాహ్ దగ్గరగా రెండు వేర్వేరు ప్రావిన్షియల్ రాజధానులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ అధికారులు వేసవి కాలంలో తాలిబన్ల ఉనికిని పదేపదే తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.