జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వాఖ్యలు

జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వాఖ్యలు

రాష్ట్ర రాజధాని అమరావతి ప్రజలను చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయపడుతున్నాడని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వాఖ్యలు చేశారు. కాగా సీఎం జగన్ రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటినుండే అమరావతి ప్రాంతానికి చెందిన రైతులందరూ కూడా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన ఆందోళనలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే రాజధాని విషయంలో అమరావతి ప్రాంత ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను చూసి తట్టుకోలేక ముఖ్యమంత్రి జగన్‌ రాజధాని ప్రకటనను వాయిదా వేశారని బుచ్చయ్య చౌదరి విమర్శించారు.

కాగా ఈమేరకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి హాజరైన టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ… ఎదో ఒక రోజు సీఎం జగన్ రాజధానిపై పంజా విసరడం ఖాయమని, రాజధానుల పేరుతో సీఎం రాక్షస క్రీడకు తెరతీశారని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇకపోతే రాష్ట్రంలో వైసీపీ నేతలు ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని, ఇకనుండైనా కూడా వైసీపీ నేతలు తమ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతె తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పలు హెచ్చరికలు చేశారు.